ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేర్యాల హత్య కేసులో వీడిన మిస్టరీ

ABN, First Publish Date - 2021-07-31T01:53:49+05:30

జిల్లాలో సంచలనం స‌ృష్టించిన వీరన్నపేట హత్య కేసు మిస్టరీ వీడింది. చేర్యాల (మ) వీరన్నపేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సిద్దిపేట: జిల్లాలో సంచలనం స‌ృష్టించిన వీరన్నపేట హత్య కేసు మిస్టరీ వీడింది. చేర్యాల (మ) వీరన్నపేట గ్రామశివారులో అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని ప్రేమ పేరుతో యువతి డబ్బులు వసూలు చేస్తూ మోసాలు చేసింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఆ యువతి, బెంగాలీ యువకుడు నివాసముంటున్నారు. ఇద్దరి మధ్య గొడవలు పెరిగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని తన స్నేహితుని కారులో వీరన్నపేట గ్రామ శివారు చెట్లపొదల్లో పెట్రోల్ పోసి నిందితులు దహనం చేసారు. నిందితులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  




వీరన్నపేటలో యువకుడి హత్య కేసు సంచలనం స‌ృష్టించిన సంగతి తెలిసిందే. చేర్యాల (మ) నాగపురి గ్రామానికి చెందిన ఓ మహిళ హైదరాబాదులో స్థిరపడగా.. ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తితో ఆన్‌లైన్‌ చాటింగ్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని తెలిసింది. ఇటీవల ఇద్దరికి గొడవ జరగడంతో సదరు వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అయోమయానికి గురైన మహిళ నాగపురిలోని తన సోదరుడికి తెలిపింది. దీంతో మహిళ సోదురుడు కారులో మృతదేహాన్ని తీసుకువచ్చి గుట్టుచప్పుడుకాకుండా వీరన్నపేట శివారులో పెట్రోల్‌ పోసి నిప్పంటించింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2021-07-31T01:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising