సీఆర్టీలతో సమానంగా వేతనం ఇవ్వాలి: యూటీఎఫ్
ABN, First Publish Date - 2021-04-11T08:45:36+05:30
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)గా పనిచేస్తున్న మహిళా సీఆర్టీల వేతనాలను సబ్జెక్టు సీఆర్టీలతో సమానంగా పెంచాలని, కనీస మూల వేతనం ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)గా పనిచేస్తున్న మహిళా సీఆర్టీల వేతనాలను సబ్జెక్టు సీఆర్టీలతో సమానంగా పెంచాలని, కనీస మూల వేతనం ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య, అన్ని జిల్లాల కేజీబీవీ వ్యాయామ ఉపాధ్యాయ ప్రతినిధులతో కలిసి శనివారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
Updated Date - 2021-04-11T08:45:36+05:30 IST