Mulugu: గోదావరిలో ఆదివాసీ మహిళల వినూత్న నిరసన
ABN, First Publish Date - 2021-12-28T14:35:27+05:30
జిల్లాలోని గోదావరి నదిలో ఆదివాసీ మహిళలు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు.
ములుగు: జిల్లాలోని గోదావరి నదిలో ఆదివాసీ మహిళలు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. తమ సొసైటీలకు వచ్చిన ఇసుక ల్యాంప్ అనుమతిని సాండ్ మాఫియా రద్దు చేయించిందని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. ఏటూరునాగారం మండలం ముళ్లకట్టలో ఇసుక ర్యాంపులను అదే గ్రామానికి గంగానమ్మ, ధనలక్ష్మి గ్రామ అభివృద్ధి సొసైటీలకు కేటాయించి ఆ వెంటనే రద్దు చేశారు. ఇందుకు నిరసనగా బాధిత మహిళలు గోదావరి ఇసుకలో న్యాయపోరాటం చేస్తున్నారు.
Updated Date - 2021-12-28T14:35:27+05:30 IST