ములుగులో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు
ABN, First Publish Date - 2021-12-09T15:48:41+05:30
జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపూర్ - ఆలుబాక గ్రామాల మధ్య మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి.
ములుగు: జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపూర్ - ఆలుబాక గ్రామాల మధ్య మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. వెంకటాపురం - వాజేడు ఏరియా కమిటీ పేరుతో లేఖలు రాశారు. మావోయిస్టు ఇన్ఫార్మర్లను హెచ్చరిస్తూ పోస్టర్లు వెలిశాయి. బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లు ప్రకటిస్తూ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మావోయిస్టులు పోస్టర్లలో పేర్కొన్నారు.
Updated Date - 2021-12-09T15:48:41+05:30 IST