మావోలు చంపిన రమేష్ మృతిపై ములుగు ఎస్పీ ప్రకటన
ABN, First Publish Date - 2021-12-23T16:43:54+05:30
మావోయిస్టుల చంపేసిన రమేష్ మృతి ఘటనపై ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రకటన విడుదల చేశారు.
ములుగు: మావోయిస్టుల చంపేసిన రమేష్ మృతి ఘటనపై ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులు అమాయక గిరిజనులను వాడుకుని అవసరం తీరాక పోలీసు కోవర్టులని ముద్రవేసి చంపేస్తున్నారన్నారు. గిరిజనులు పోలీసులకు సహకరించొద్దని తెలిపారు. మావోయిస్టులు ఈనెల 20న కొరస రమేష్, కురసం రమేష్ ఇద్దరిని మిలీషియా సభ్యుల ద్వారా పిలిపించుకున్నారని చెప్పారు. కొరస రమేష్ను కాల్చిచంపి, కురసం రమేష్ను చర్ల మండలంలో వదిలేశారని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పేర్కొన్నారు.
Updated Date - 2021-12-23T16:43:54+05:30 IST