ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-04-19T06:25:00+05:30

ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడికూడ, ఏప్రిల్‌ 18 : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆవుల రాజయ్య (53) వ్యవసాయ పనుల నిమిత్తం పశువుల మేత కోసం (గడ్డి) కొడవలి తీసుకుని సైకిల్‌పై శనివారం వ్యవసాయ బావివద్దకు వెళ్లాడు. శని వారం రాత్రి పొద్దుపోయే వరకూ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు తెలిసిన కాడల్లా వెతికారు. ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆదివారం ఉదయం మృతుడి భార్య అవుల సమ్మక్క తన చెల్లెలి కొడుకు నేతల సురేష్‌తో కలిసి వ్యవసాయ పొలాల్లో వెతికారు. ఈ క్రమంలో వారి వ్యవసాయ పొలం పక్కన ఉన్న కోడెపాక అయిలయ్యకు చెందిన వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెంది కనిపించినట్లు తెలిపారు. మృతుడికి భార్య సమ్మక్క, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-04-19T06:25:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising