అసలైన యుద్ధం మేం చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి
ABN, First Publish Date - 2021-11-18T00:13:57+05:30
వారం లోపు వడ్లను కొనుగోలు చేయకపోతే అసలైన యుద్ధం తాము
సూర్యాపేట: వారం లోపు వడ్లను కొనుగోలు చేయకపోతే అసలైన యుద్ధం తాము చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జిల్లాలోని నూతనకల్ మండలంలోని ఐకేపీ సెంటర్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే డ్రామాలతో రైతులు బలవుతున్నారన్నారు. కేసీఆర్కి దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటున్నప్పుడు ముందుగా వడ్లని కొనుగోలు చేసి తరువాత కేంద్రంపై పోరాడాలని ఆయన సూచించారు.
Updated Date - 2021-11-18T00:13:57+05:30 IST