కేంద్రమంత్రి అమిత్షాతో ఎంపీ అరవింద్ భేటీ
ABN, First Publish Date - 2021-12-09T17:50:11+05:30
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎంపీ ధర్మపురి అరవింద్ గురువారం భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎంపీ ధర్మపురి అరవింద్ గురువారం భేటీ అయ్యారు. బైంసా అల్లర్ల అనంతరం పార్టీ కార్యకర్తలను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ పిర్యాదు చేశారు. నలుగురు కార్యకర్తలపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేశారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, ఎంఐఎం నేతల ఆదేశాల అనుగుణంగా పోలీసులు పని చేస్తున్నారని ఎంపీ తెలియజేశారు. కార్యకర్తల రక్షణకు, ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలని అమిత్ షాను ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు.
Updated Date - 2021-12-09T17:50:11+05:30 IST