జీడిమెట్లలో మనీ ట్రాన్స్ఫర్ ఆఫీసులో గన్నుతో బెదిరించి దోపిడీ
ABN, First Publish Date - 2021-04-17T16:25:37+05:30
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. మనీ ట్రాన్స్ఫర్ ఆఫీసులో ఇద్దరు దొంగలు చొరబడి గన్నులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన...
జీడిమెట్ల : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. మనీ ట్రాన్స్ఫర్ ఆఫీసులో ఇద్దరు దొంగలు చొరబడి గన్నులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన భాగ్యలక్ష్మి కాలనీ సాయిబాబా ఆలయ సమీపంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో హెల్మెట్ ధరించిన ఇద్దరు దొంగలు మనీ ట్రాన్స్ఫర్ కార్యాలయంలో చోరబడి గన్ను తీసి యజమాని బెదిరించారు. రూ. 1,95000 నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఈ ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-04-17T16:25:37+05:30 IST