ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ, కేసీఆర్‌కు ఉరివేయడం ఖాయం: రేవంత్‌

ABN, First Publish Date - 2021-11-27T23:03:06+05:30

మోదీ, కేసీఆర్‌కు ఉరివేయడం ఖాయం: రేవంత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వరి కొనకపోతే ప్రదాని మోదీ, సీఎం కేసీఆర్‌కు ఉరివేయడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద వరి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనకపోతే కేసీఆర్‌ గద్దె దిగాల్సిందేనని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఈ రాత్రి ధర్నాచౌక్‌లోనే నిద్రిస్తామని ప్రకటించారు. రైతుల మృతికి సీఎం కేసీఆర్‌ కారణమని దుయ్యబట్టారు. వరి కుప్పలపైనే రైతు గుండె ఆగిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదని తప్పుబట్టారు. కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదని, మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ ధాన్యం కొనకుండా దళారీగా మారారని, రైతులపై ఆయన కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండు, అరగుండు మనకు పంగనామాలు పెడతారని తెలిపారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ వేరు కాదు..ఒకరు సారా మరొకరు సోడా అని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు తోడుదొంగలేనని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.


Updated Date - 2021-11-27T23:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising