ఒకే వేదికపై బండి సంజయ్, కల్వకుంట్ల కవిత
ABN, First Publish Date - 2021-10-18T01:32:55+05:30
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే వేదికపై కూర్చున్న దృశ్యం జలవిహార్లో..
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే వేదికపై కూర్చున్న దృశ్యం జలవిహార్లో నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమంలో జరిగింది. అంతేకాదు రాజకీయాలు పక్కన పెట్టి వాళ్లిద్దరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఈ వేడుకలో వారూ, వీరూ అనే బేధం లేకుండా అన్ని పార్టీల వారిని పిలిచి నిజమైన దసరా స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు బండారు దత్తాత్రేయ గుర్తు చేస్తున్నారని కవిత కొనియాడారు.
ఇక ఇదే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కూడా పాల్గొన్నారు.
Updated Date - 2021-10-18T01:32:55+05:30 IST