ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

ABN, First Publish Date - 2021-12-14T08:02:36+05:30

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

5 జిల్లాల్లో కౌంటింగ్‌ కేంద్రాలు: సీఈవో

హైదరాబాద్‌, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో చేపట్టే ఓట్ల లెక్కిపును ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తామని చెప్పారు. రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడిస్తామని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో టెక్నికల్‌ ట్రైనింగ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, నల్లగొండలో టీటీడీసీ (డీఆర్‌డీవో), మెదక్‌లో ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, ఖమ్మంలోని జిల్లా పంచాయత్‌ రీసోర్స్‌ సెంటర్‌ (డీపీఆర్‌సీ), కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఈవో వివరించారు. కాగా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన ఆరు స్థానాలకు ఈనెల 10న పోలింగ్‌ నిర్వహించారు.

Updated Date - 2021-12-14T08:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising