ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సభను బుల్డోజ్ చేస్తున్నారు: ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

ABN, First Publish Date - 2021-03-17T19:57:44+05:30

మంద బలంతో సభను బుల్డోజ్ చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంద బలంతో అసెంబ్లీ సమావేశాలను బుల్డోజ్ చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు విమర్శించారు. సంఖ్యా బలంతో సభను సీఎం ఏకపక్షంగా నడిపిస్తున్నారని శ్రీధర్‌బాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రజా సమస్యలు వినే ఓపిక లేకపోవటం బాధాకరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తన తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.


45 రోజులు జరగాల్సిన సమావేశాలను ఆరు రోజులకు కుదించటం‌ సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. రైతులు, నిరుద్యోగులు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై సభలో ప్రతిపక్షాలు మాట్లాడితే సీఎంకు నచ్చటం లేదని ఆయన విమర్శించారు. విభజన హామీల సాధన కోసం ప్రతిపక్షాలను కేంద్రం దగ్గరకు కేసీఆర్ తీసుకెళ్ళాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-03-17T19:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising