రైతు దీక్షను విజయవంతం చేయాలి : సీతక్క
ABN, First Publish Date - 2021-01-20T05:09:30+05:30
రైతు దీక్షను విజయవంతం చేయాలి : సీతక్క
ములుగుటౌన్, జనవరి 19: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్న ఢిల్లీ రైతులకు మద్దతుగా ఈ నెల 28న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ములుగులో చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడారు. ఢిల్లీలో అన్నదాతలు అలుపెరుగక పోరాడుతూ అసువులు బాసుతున్నా కేంద్రానికి చీమకుట్టినట్టు కూడా లేదని దుయ్యబట్టారు. ఢిల్లీ పర్యటన తర్వాత మాటమార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు సరైన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు ఎమ్డీ.చాంద్పాషా, నాయకులు చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్, జంగిలి రవి, శ్రీకాంత్రెడ్డి, కొండం రవీందర్రెడి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-20T05:09:30+05:30 IST