సోనియా, రాహుల్ ఫోన్లను కేంద్రం ట్యాప్ చేస్తోంది: జగ్గారెడ్డి
ABN, First Publish Date - 2021-07-22T21:21:27+05:30
నరేంద్రమోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: నరేంద్రమోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ సోనియా, రాహుల్ గాంధీల ఫోన్లను కేంద్రం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందన్నారు. దీనిపై నిరసన తెలపకుండా అడ్డుకోవడం దుర్మార్గమని జగ్గారెడ్డి మండిపడ్డారు.
Updated Date - 2021-07-22T21:21:27+05:30 IST