మార్కెట్కు కొత్త మిర్చి
ABN, First Publish Date - 2021-10-22T05:12:28+05:30
మార్కెట్కు కొత్త మిర్చి
వరంగల్టౌన్, అక్టోబరు 21: ఏనుమాముల వ్యవసాయ మార్కె ట్కు గురువారం 14 బస్తాల తేజ రకం కొత్త మిర్చి అమ్మకానికి వ చ్చింది. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన రైతు ఉప్పలయ్య సమన్విత ట్రేడర్స్కు అడ్తికి తీసుకురాగా శ్రీరామ జనరల్ మర్చంట్స్ క్వింటాకు రూ.11,601 కొనుగోలు చేశారు. కొత్త మిర్చి సీజన్కు ముందే రావడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేశా రు. రైతు ఉప్పలయ్య మాట్లాడుతూ..రోహిణి కార్తీ(మే)లోనే విత్తనా లు పెట్టి సాగు చేశామని తెలిపారు. అందరి కంటే ముందు తీసుకురావడంతో ధర ఎక్కువ ఉంటుందని ఆశించామని, కానీ ధర ఆశించినంత లేదన్నారు. క్వింటాకు కనీసం రూ.20వేలు ధర ఆశించినట్టు పేర్కొన్నాడు.
Updated Date - 2021-10-22T05:12:28+05:30 IST