కొముర వెల్లి మల్లన్నకు పట్టు వస్ర్తాల బహుకరణ
ABN, First Publish Date - 2021-12-26T20:10:04+05:30
ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే కొమురవెల్లి మల్లన్నకళ్యాణ మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది. వేడుకల్లో పాల్గొనేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు.
సిద్దిపేట: ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే కొమురవెల్లి మల్లన్నకళ్యాణ మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది. వేడుకల్లో పాల్గొనేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ సంవర్భంగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా కొముర వెల్లి మల్లన్న కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వారికి ఆలయ మర్యాదలతో అధికారులు ఆహ్వానించారు.
Updated Date - 2021-12-26T20:10:04+05:30 IST