ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళేశ్వరం జలాలతో సూర్యాపేట సస్యశ్యామలం: మంత్రి జగదీష్ రెడ్డి

ABN, First Publish Date - 2021-03-01T20:22:35+05:30

కాళేశ్వరం జలాలతో మూడేళ్ళుగా సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమైందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కాళేశ్వరం జలాలతో మూడేళ్ళుగా సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమైందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా స్వామి వారిని మంత్రి శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి జగదీష్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం పూజలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమ పొలాలు పచ్చగా మారడంతో రైతుల సంతోషం లింగమంతుల స్వామి జాతరలో కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.


యాదవ సోదరులపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని ఆయన అన్నారు. ఆ ప్రేమతోనే ఈ జాతరకు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేశారని మంత్రి తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల కోసం 24 గంటల నిరంతర తాగు నీరు, విద్యుత్ సరఫరానును ఏర్పాటు చేసామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 







పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర  వైభవంగా సాగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెద్దగట్టును సీఎం కేసీఆర్ చాలా అభివృద్ధి చేశారని తలసాని పేర్కొన్నారు. రాష్ట్రన్నీ మరింత సుభిక్షంగా చేయాలని యాదవుల ఇలవేల్పు లింగమంతుల స్వామిని కోరుకున్నానని తలసాని తెలిపారు. తెలంగాణ దేవాలయాలకు సీఎం కేసీఆర్ పునర్ వైభవం తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-01T20:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising