ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్ జపం చేస్తున్న మంత్రులు: ఐలయ్య

ABN, First Publish Date - 2021-01-25T16:32:52+05:30

ప్రజా సమస్యలను మరిచి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని మంత్రులు కేటీఆర్ జపం చేస్తున్నారని అక్కన్నపేట మండల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కన్నపేట:  ప్రజా సమస్యలను మరిచి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని మంత్రులు కేటీఆర్ జపం చేస్తున్నారని అక్కన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య విమర్శించారు. సోమవారం అక్కన్నపేట లో విలేకరుల సమావేశంలో ఐలయ్య మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్  ఒక్క తాను ముక్కలేనని, ఇద్దరు దొందూ దొందేనని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు, పెన్షన్లు తదితర హామీలను విస్మరించారని ఆరోపించారు.


ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ముఖ్యమంత్రి మార్పు ప్రచారం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోందని ఆరోపించారు. ఇచ్చిన హామీల  అమలుకోసం కృషి చేయాలని, లేని పక్షంలో గుణపాఠం తప్పదని ఐలయ్య హెచ్చరించారు.

Updated Date - 2021-01-25T16:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising