ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుకే ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలుస్తున్నారు: మంత్రి తలసాని

ABN, First Publish Date - 2021-04-13T19:45:10+05:30

కార్యకర్త ఇంట్లో ఉగాది పర్వదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తలసాని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లా, అనుముల గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఈదయ్య నివాసంలో ప్లవ నామ ఉగాది వేడుకలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్యకర్త ఇంట్లో ఉగాది పర్వదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు ఎంతో ఆనందంగా ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు తమ హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా టీఆర్ఎస్ పార్టీపై నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేపు (బుధవారం) హాలియాలో జరగనున్న సీఎం కేసీఆర్ సభకు ఉత్సాహంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్దమవుతున్నారని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-04-13T19:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising