ధర్నా దెబ్బతో దిగివచ్చిన మోదీ: మంత్రి తలసాని
ABN, First Publish Date - 2021-11-19T22:39:29+05:30
రైతులకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: రైతులకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ గర్జనకు ఢిల్లీలో కదలిక వచ్చిందన్నారు. కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న నేపద్యంలో మంత్రి తలసాని ఆధ్వర్యంలో శుక్రవారం సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
Updated Date - 2021-11-19T22:39:29+05:30 IST