ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెల్లు గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి: మంత్రి తలసాని

ABN, First Publish Date - 2021-10-27T21:12:46+05:30

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం మామిడాలపల్లి, గొల్లపల్లి గ్రామాలలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం మామిడాలపల్లి, గొల్లపల్లి గ్రామాలలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేదాసరి మనోహర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తే ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. 70 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోందని అన్నారు.


టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు చేయూత అందిస్తోందన్నారు.గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బిజెపి నేతలు విమర్శలు మాని ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నిధులు తీసుకురావాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు.అభివృద్ధి పనులు కొనసాగాలంటే బలహీన వర్గాల బిడ్డ గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-10-27T21:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising