ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోలన్నదే ప్రభుత్వ ఆలోచన

ABN, First Publish Date - 2021-09-18T20:12:35+05:30

పండగలను ప్రజలు సంతోషంగా, శాంతి భద్రతల మధ్య జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పండగలను ప్రజలు సంతోషంగా, శాంతి భద్రతల మధ్య జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీని కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. 


గణేష్ నిమజ్జనానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగి పోయాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.దీనికి కోసం చొరవ చూపిన ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతి యుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని సూచించారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు రాఘవ రెడ్డి, భగవంతరావు పాల్గొన్నారు. శోభాయాత్ర నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని వారికి వివరించారు. 

Updated Date - 2021-09-18T20:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising