ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆషాఢ బోనాల నిర్వహణకు రూ.15 కోట్లు కేటాయింపు: తలసాని

ABN, First Publish Date - 2021-07-19T21:11:12+05:30

ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు గాను ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు గాను ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 15 లక్షల రూపాయల చెక్కును ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ లోని మిగిలిన ఆలయాలకు ఈ నెల 20 వ తేదీ మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అందజేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-19T21:11:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising