ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ నాయకులకు పదవి పై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: తలసాని

ABN, First Publish Date - 2021-04-10T19:48:10+05:30

కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులపై ఉన్న ప్రేమ ప్రజల సమస్యలను పరిష్కరించడం లో లేదని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జున సాగర్: కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులపై ఉన్న ప్రేమ ప్రజల సమస్యలను పరిష్కరించడం లో లేదని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తిరుమలగిరి మండలం నెల్లికల్లు గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజక వర్గం ఇంచార్జి, దేవరకొండ ఎంఎల్ఏ రవీందర్ కుమార్, ఎంపిపి భగవాన్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు కడారి అంజయ్య లతో కలిసి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి 7 సార్లు ఎంఎల్ఏ గా గెలిచిన జానారెడ్డి 14 సంవత్సరాల పాటు మంత్రిగా పని చేసి ఓటేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. 2018 ఎన్నికలలో నోముల నర్సింహయ్య గెలవడంతో నియోజకవర్గం వైపుకు కూడా రాని జానారెడ్డి కి ఉప ఎన్నికలు రావడంతో నియోజకవర్గ ప్రజలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు.


కీలకపదవులలో ఉన్నప్పటికీ జానారెడ్డి ఈ నియోజకవర్గంకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 70 సంవత్సరాల లో జరగని అభివృద్ధి ని 7 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం  చేసిందని అన్నారు. నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల ఎన్నో సంవత్సరాల కల అని, ఆ కలని ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని అన్నారు. ఈ నెల 17 వ తేదీన జరిగే ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించి అభివృద్ధి కి పట్టం కట్టాలని కోరారు.

Updated Date - 2021-04-10T19:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising