సినారెకు నివాళుర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ABN, First Publish Date - 2021-07-30T00:56:52+05:30
సాహితీవేత్త, ప్రముఖ కవి డా. సి.నారాయణరెడ్డి 90 జయంతి సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనకు ఘనంగా నివాళుర్పించారు.
హైదరాబాద్: సాహితీవేత్త, ప్రముఖ కవి డా. సి.నారాయణరెడ్డి 90 జయంతి సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనకు ఘనంగా నివాళుర్పించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ కు చెందిన మహనీయులు, కవులు, సాహితీ వేత్తలు, సామాజిక వేత్తలను గుర్తించి వారి జయంతి, వర్ధంతిలను తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ప్రభుత్వం తరుపున ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ కి డా.సి. నారాయణ రెడ్డి రచనలు ఎంతో ఇష్టమన్నారు. సినారె అంత్యక్రియలలో పాల్గొని స్వయంగా పాడే మోసి వారి పట్ల ఉన్న అభిమానాన్ని చాటారన్నారు. సినారె పేరుతో " సినారె సారస్వత సదనం " నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సి. నారాయణ రెడ్డి కవిగా, సినీగీత రచయిత గా పలు సాహితీ ప్రక్రియ లను కొనసాగించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్ఠం చేశారన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని గంగా జమునా తహజీబ్ కు ప్రతీకగా నిలిపారన్నారు. ఈ సందర్భంగా మంత్రి డా. సినారె కుటుంబ సభ్యులను సన్మానించారు.
Updated Date - 2021-07-30T00:56:52+05:30 IST