ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోతలను బట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-04-23T21:06:54+05:30

రాష్ట్రంలో రైతులు పండించే ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ వైఖరిస్పష్టంగా వుందని, కొతలను బట్టి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించే ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ వైఖరిస్పష్టంగా వుందని, కొతలను బట్టి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 3028 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే అయితే సంచికి 40 కిలోల 700 గ్రాముల ధాన్యం మాత్రమే తూకం వెయ్యాలి. తూకాల వద్ద పకడ్భంధీగా వ్యవహరించి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలని మంత్రి పేర్కొన్నారు. నాణ్యతతో ధాన్యం తెచ్చిన రైతులను అభినందించి ప్రోత్సహించాలని అన్నారు.


కొనుగోలు కేంద్రాలు, రైతుల సమస్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రుల నివాస సముదాయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం ఉన్నన్ని రోజులు రైతులకు ఏదో ఒక సమస్య ఉంటుంది. రాష్ట్రంలోని సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకోవాలి. దీనిమూలంగా రైతుల ఇతర సమస్యలు కూడా మీ దృష్టికి వస్తాయని మంత్రి అన్నారు.


అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసిపోకుండా చర్యలు  తీసుకోవాలని,  రైతులు తమ వద్ద ఉన్న టార్పాలిన్లు ధాన్యం కొనుగోలుకేంద్రాలకు తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ నిబంధనలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు నిబంధనలు రైతులకు అర్ధమయ్యేలా వివరించాలన్నారు. డీఆర్డీఎ, మహిళా సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పౌరసరఫరాల శాఖ కొనుగోళ్ల విషయంలో సమన్వయంతో వ్యవహరించాలి.




వరి కోతలు పూర్తయిన తర్వాత రైతులు పొలాలలో గడ్డిని కాల్చవద్దని, అధికారులు రైతులను ఈ విషయంలో చైతన్యం చేయాలని సూచించారు. అలాగే వానాకాలం సాగులో పత్తి, కంది సాగు విస్తృతి పెంచాలని అన్నారు. సన్నవడ్ల సాగును పెంచాలని చెప్పారు. ఇప్పటి నుండే ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలన్నారు. ఇక ఉపాధిహామీ కింద అన్ని గ్రామాలలో కాల్వల పూడికతీత పనులు వందశాతం పూర్తికావాలని పేర్కొన్నారు. ఏ కారణం చేత పూడికతీత పనులు చేపట్టకపోయినా సంబంధిత సర్పంచ్, కార్యదర్శులదే బాధ్యత వహించాలన్నారు. తూతూమంత్రంగా పనులుచేసినా, పనులు చేపట్టకపోయినా సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2021-04-23T21:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising