రైతుబంధు తొలిరోజే రూ.544.55 కోట్ల విడుదల
ABN, First Publish Date - 2021-12-29T23:19:01+05:30
దేశానికి, ప్రపంచానికి రైతుబంధు, రైతుభీమా పథకాలు ఒక దిక్సూచి వంటిదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: దేశానికి, ప్రపంచానికి రైతుబంధు, రైతుభీమా పథకాలు ఒక దిక్సూచి వంటిదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని అన్నారు.రైతు బంధు నిధుల విడుదల ప్రారంభమైన మంగళవారం ఒక్కరోజే రూ.544.55 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నిదులను 18,12,656 రైతుల ఖాతాలలో జమచేసినట్టు తెలిపారు.సమైక్య పాలనలో వట్టిపోయిన తెలంగాణ భూములు కేసీఆర్ ముందుచూపుతో పచ్చటి పంటలతో అలరారుతున్నాయని అన్నారు.ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందని అన్నారు.రైతులకు, వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
Updated Date - 2021-12-29T23:19:01+05:30 IST