పాతబస్తీ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష
ABN, First Publish Date - 2021-08-10T00:24:52+05:30
నగరంలోని పాతబస్తీ అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు, రహదారులు, నాలాల వెడల్పు పనులపై చర్చించారు. రెండు పడక గదుల నిర్మాణం, తాగునీటి రిజర్వాయర్, పైపులైన్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రగతి గురించి సుదీర్ఘ చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పాతబస్తీ అభివృద్ధి పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. పనుల్లో అవాంతరాలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తేవాలన్నారు. సమయానికి పనులు పూర్తయ్యేలా ఉన్నతాధికారులు శ్రద్ధ వహించాలని కేటీఆర్ పేర్కొన్నారు. సమీక్షలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పురపాలక శాఖ మఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-08-10T00:24:52+05:30 IST