హుజూరాబాద్ ఓటమిపై స్పందించిన కేటీఆర్
ABN, First Publish Date - 2021-11-03T01:23:15+05:30
హుజూరాబాద్ ఓటమిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒక్కసారి వచ్చిన విశ్రమ ఫలితంతో పార్టీకి నష్టం కలగదన్నారు. పార్టీపై ఎలాంటి ప్రభావం ఉందని చెప్పారు. ఒక్క ఓటమితో ..
హైదరాబాద్: హుజూరాబాద్ ఓటమిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒక్కసారి వచ్చిన మిశ్రమ ఫలితంతో పార్టీకి నష్టం కలగదన్నారు. పార్టీపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఒక్క ఓటమితో కుంగి పోవాల్సిన అవసరం లేదని, 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో గెలుపోటములను చూసిందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పోరాడారని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాగా హుజూరాబాద్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్పై 23, 855 ఓట్ల మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుపొందారు.
Updated Date - 2021-11-03T01:23:15+05:30 IST