పార్లమెంట్లో నిలదీస్తాం: కేటీఆర్
ABN, First Publish Date - 2021-12-10T21:20:56+05:30
రాష్ట్రంలోని చేనేత కార్మికుల తరపున పార్లమెంట్లో కేంద్ర
సిరిసిల్ల: రాష్ట్రంలోని చేనేత కార్మికుల తరపున పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికులపై కేంద్రం సవితి ప్రేమ చూపితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. బీజేపీని పార్లమెంట్లో వదిలి పెట్టబోమన్నారు. అలాగే ప్రజాక్షేత్రంలోనూ కూడా వదిలి పెట్టబోమన్నారు. పీఎం మిత్ర కింద రాష్ట్రానికి వెయ్యి కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక బీజేపీ నేతలు తమతో పోరాటంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Updated Date - 2021-12-10T21:20:56+05:30 IST