మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ సంభాషణ వైరల్
ABN, First Publish Date - 2021-11-30T02:44:18+05:30
జూలపల్లి మండలం అబ్బాపూర్ ఎంపీటీసీతో మంత్రి కొప్పుల ఈశ్వర్ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో..
పెద్దపల్లి: జూలపల్లి మండలం అబ్బాపూర్ ఎంపీటీసీతో మంత్రి కొప్పుల ఈశ్వర్ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ‘‘ఎంపీటీసీల మద్దతు కూడగడుతున్నావని, ప్రతి ఒక్కరూ నీ పేరే చెబుతున్నారు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. నువ్వు నా మనిషివి. డబ్బులు కావాలంటే ఇప్పిస్తా. ఎంపీటీసీలను తీసుకొని నా దగ్గరకు రా.’’ అని అబ్బాపూర్ ఎంపీటీసీతో మంత్రి కొప్పుల మాట్లాడారు. ఇప్పుడు ఈ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Updated Date - 2021-11-30T02:44:18+05:30 IST