ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి అంటే ఉరే అనేలా పరిస్థితులు: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-04-06T19:54:12+05:30

వరి అంటే ఉరే అనేలా పరిస్థితులు మారుతున్నాయని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లాలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట : వరి అంటే ఉరే అనేలా పరిస్థితులు మారుతున్నాయని  మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లాలోని కేసారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, రైతు వేదికలను మంత్రులు జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో లేని విధంగా పూర్తి స్థాయిలో మూసీ ఆయకట్టు రైతాంగానికి సాగు నీరు అందిస్తున్నామని చెప్పారు. మూసీ ఆనకట్టను ఆధునీకరణ చేసిన ఘనత టీఆర్ఎస్‌దేనని మంత్రి జగదీష్‌రెడ్డి  అన్నారు. కేసీఆర్ ముందు చూపుతో వ్యవసాయం పండుగలా సాగుతుందన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణాగా మార్చింది సీఎం కేసీఆరేనని తెలిపారు. ఉచిత విద్యుత్ , రైతు బంధు , రైతు బీమా పథకాలతో రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతాంగాన్ని చైతన్య పరచి వారి ఆదాయం పెంచేందుకే రైతు వేదికలని చెప్పారు. ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని మంత్రి జగదీష్‌రెడ్డి  పేర్కొన్నారు.

Updated Date - 2021-04-06T19:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising