తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ: మంత్రి జగదీష్రెడ్డి
ABN, First Publish Date - 2021-12-11T22:13:47+05:30
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సర్కార్ సిద్ధంగా
హైదరాబాద్: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సర్కార్ సిద్ధంగా ఉందని ABNతో మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఈవో వాహనాలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రో ధరలు పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రభుత్వం ఆలోచిస్తుందని ABNతో జగదీష్రెడ్డి అన్నారు.
Updated Date - 2021-12-11T22:13:47+05:30 IST