ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాగణపతిని దర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ABN, First Publish Date - 2021-09-17T20:16:30+05:30

ఖైరతాబాద్ గణేషున్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్ర‌వారం మహాగణపతి దర్శనానికి వెళ్లిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి గణేష్ ఉత్సవ కమిటీ స‌భ్యులు స్వాగతం పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైద‌రాబాద్: ఖైరతాబాద్ గణేషున్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దర్శించుకున్నారు.  శుక్ర‌వారం మహాగణపతి దర్శనానికి వెళ్లిన  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి గణేష్ ఉత్సవ కమిటీ స‌భ్యులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతాయని, కానీ గత సంవత్సరం కరోనా కారణంగా పండగ సందడి లేకున్నా ఈసారి మాత్రం ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.


నిమజ్జన ర్యాలీలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కోవిడ్ మహమ్మారినిపూర్తిగా నివారించాలని ఆ దేవుడిని కోరుకున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే  కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని అన్నారు. 

Updated Date - 2021-09-17T20:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising