ఈటలపై మంత్రి గంగుల ఫైర్
ABN, First Publish Date - 2021-06-29T22:13:24+05:30
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్/జమ్మికుంట: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈటెల రాజేందర్ జమ్మికుంట ప్రాంతానికి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఈటలను గెలిపిస్తే నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ఆయన సమాధానం చెప్పాలని మంత్రి గంగుల డిమాండ్ చేశారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ను ఈటల నిధులు అడగలేదని ఆయన విమర్శించారు. సీఎంను ఈటల కలిసిన ప్రతిసారీ తన సొంత పనులే చక్కబెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ తరహాలో జమ్మికుంట పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
Updated Date - 2021-06-29T22:13:24+05:30 IST