కరోనా పట్ల మరింత అప్రమత్తం:ఎర్రబెల్లి
ABN, First Publish Date - 2021-04-09T08:35:17+05:30
కరోనా పట్ల మరింత అప్రమత్తం:ఎర్రబెల్లి
హైదరాబాద్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): కరోనాపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. పల్లెప్రగతిపై అన్ని జిల్లాల అదనపు కలెకర్లు,, డీఆర్డీఓలు, డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో మాదిరిగానే గ్రామ కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది మొదలు ఉన్నతాధికారుల వరకు ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ, పర్యవేక్షణ చేయాలని, సూచించారు.
Updated Date - 2021-04-09T08:35:17+05:30 IST