కొత్తపల్లి వాసుదేవరావు మృతికి మంత్రి ఎర్రబెల్లి సంతాపం
ABN, First Publish Date - 2021-05-06T00:28:43+05:30
ప్రత్యేక తెలంగాణ పోరాట సిద్దాంతకర్త, దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సోదరుడు కొత్తపల్లి వాసుదేవరావు మృతికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం తెలిపారు
వరంగల్: ప్రత్యేక తెలంగాణ పోరాట సిద్దాంతకర్త, దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సోదరుడు కొత్తపల్లి వాసుదేవరావు మృతికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం తెలిపారు. అహర్నిశలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషిచేసిన మహానీయుడు ప్రొ. కొత్తపల్లి జయశంకర్ సార్కు చేదుడు వాదోడుగా ఉండి ప్రొత్సహించిన మహానీయుడు వాసుదేవరావు అని కొనియాడారు. వాసుదేవరావు కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Updated Date - 2021-05-06T00:28:43+05:30 IST