భారత్ బయోటెక్ కంపెనీకి సీఐఎస్ఎఫ్ భద్రత
ABN, First Publish Date - 2021-06-14T19:33:16+05:30
భారత్ బయోటెక్ కంపెనీకి కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్తో భద్రత...
మేడ్చల్ జిల్లా: శామీర్పేట్ జినోమ్వ్యాలీలో కరోనా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీకి కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్తో భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సోమవారం నుంచి 64 మంది సిబ్బందితో కూడిన సీఐఎస్ఎఫ్ బృందం ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. కొవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థపై ఉగ్రవాదుల కన్ను పడే అవకాశం ఉండడంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Updated Date - 2021-06-14T19:33:16+05:30 IST