ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫారెస్ట్ అధికారుల ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-09-03T17:18:05+05:30

తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు, గిరిజన రైతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు, గిరిజన రైతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అటవీ భూములు ఆక్రమించుకున్నారంటూ అధికారులు స్వాధీనానికి యత్నించడంతో ఉద్రిక్తత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్‌ మండలంలో గిరిజన మహిళా రైతు ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. గంగరాయి తండా శివారులోని సౌత్‌ బీట్‌ కంపార్ట్‌మెంట్‌ 71లో గల రెండెకరాల పోడు భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వారు. ఇదే భూమిని 20 ఏళ్లుగా మహిళ రైతు మాలావత్‌ జ్యోతి కుటుంబం సాగు చేసుకుంటోంది. అధికారులు గుంటలు తవ్వుతున్న విషయం తెలుసుకున్న ఆమె వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అధికారులను వేడుకుంది. 2012లో అధికారులు తనకిచ్చిన భూమి పత్రాలను కూడా చూపించింది. అయినా అధికారులు వినకపోవడంతో వారి ముందే పురుగుల మందు తాగింది. దీంతో తోటి రైతులు జ్యోతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అధికారులపై తండా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-09-03T17:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising