పల్వట్లలో చోరీ
ABN, First Publish Date - 2021-04-21T05:53:30+05:30
వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపు కొందరు దొంగలు ఇంటిని దోపిడీ చేశారు. తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా పెట్టుకున్న దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల పరిధిలోని పల్వట్ల గ్రామంలో మంగళవారం రాత్రి వెలుగు చూసింది.
వట్పల్లి: వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లి వచ్చేలోపు కొందరు దొంగలు ఇంటిని దోపిడీ చేశారు. తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా పెట్టుకున్న దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల పరిధిలోని పల్వట్ల గ్రామంలో మంగళవారం రాత్రి వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి కరోనా వైరస్ సోకడంతో చికిత్స నిమిత్తం ఈనెల 13న వీరు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లారు. చికిత్స అనంతరం మంగళవారం రాత్రి తమ ఇంటి (పల్వట్ల)కి వచ్చారు. దొంగలు మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదు అపహరించినట్లు వారు తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీసులను అడగ్గా తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిపారు.
Updated Date - 2021-04-21T05:53:30+05:30 IST