దేశ రక్షణలో సైనికుల సేవలు అమోఘం
ABN, First Publish Date - 2021-07-27T03:53:14+05:30
దేశ రక్షణలో సైనికుల సేవలు అమోఘమని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి పేర్కొన్నారు.
సంగారెడ్డి అర్బన్, జూలై 26: దేశ రక్షణలో సైనికుల సేవలు అమోఘమని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని ఐబీ వద్ద కార్గిల్ విజయ్దివ్సను పురస్కరించుకొని సోమవారం కార్గిల్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో కార్గిల్ అమరవీరుల స్థూపం ఏర్పాటుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అంతకు ముందు కొత్త బస్టాండ్ నుంచి ఐబీ వరకు ర్యాలీ నిర్వహించి ఐబీ వద్ద కార్గిల్ అమరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనేశ్కుమార్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు, ఎన్.దశరథ్, తోపాజి అనంతకిషన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-27T03:53:14+05:30 IST