చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
ABN, First Publish Date - 2021-03-01T05:20:33+05:30
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతైన సంఘటన మండలంలోని రెడ్డిఖానాపూర్లో చోటు చేసుకున్నది.
హత్నూర, ఫిబ్రవరి 28 : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతైన సంఘటన మండలంలోని రెడ్డిఖానాపూర్లో చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన మాచుకూరి లింగయ్య గ్రామ శివారులో గల మంజీరా పరీవాహక ప్రాంతంలో చేపల వేటకు వెళ్లాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అందులో మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని వెతికినా ఆచూకీ లభించలేదు. సంఘటనా స్థలానికి తహసీల్దార్ పద్మావతి, ఎస్ఐ రాజే్షనాయక్ చేరుకుని పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Updated Date - 2021-03-01T05:20:33+05:30 IST