రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలం
ABN, First Publish Date - 2021-12-05T04:52:29+05:30
రైతులకు రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్యాల శ్రవన్కుమార్రెడ్డి విమర్శించారు.
నోటీసులతో రైతులకు వేధింపులు
దుబ్బాక ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకుల ఽధర్నా
దుబ్బాక, డిసెంబరు 4: రైతులకు రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్యాల శ్రవన్కుమార్రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయాలని కోరుతూ శనివారం దుబ్బాక తహసీల్దార్కు విపతిపత్రాన్ని అందజేశారు. అనంతరం రైతులతో కలిసి స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు కాలేదని మండిపడ్డారు. బ్యాంకు అధికారులు రుణాలను చెల్లించాలని రైతులకు నోటీ్సలను పంపి వేధిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రైతుల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
Updated Date - 2021-12-05T04:52:29+05:30 IST