ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత మహిళననే అధికారులు పట్టించుకోవడం లేదు

ABN, First Publish Date - 2021-10-30T04:40:53+05:30

తాను దళిత మహిళననే కారణంతోనే అధికారులు పట్టించుకోవడం లేదని దౌల్తాబాద్‌ ఎంపీపీ గంగాధర సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుతోనే తాను ఎంపీపీని అయ్యానని తెలిపారు. అధికారిక కార్యక్రమాలకు, మండలంలోని ఇతర అభివృద్ధి పనులపై అధికారులు తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని వాపోయారు.

సమావేశంలో మాట్లాడుతున్న దౌల్తాబాద్‌ ఎంపీపీ సంధ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దౌల్తాబాద్‌ ఎంపీపీ గంగాధరి సంధ్య ఆవేదన


రాయపోల్‌, అక్టోబరు 29 : తాను దళిత మహిళననే కారణంతోనే అధికారులు పట్టించుకోవడం లేదని దౌల్తాబాద్‌ ఎంపీపీ గంగాధర సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుతోనే తాను ఎంపీపీని అయ్యానని తెలిపారు. అధికారిక కార్యక్రమాలకు, మండలంలోని ఇతర అభివృద్ధి పనులపై అధికారులు తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. మండల ప్రత్యేకాధికారి మొదలుకొని, పంచాయతీ కార్యదర్శి వరకు తనను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్ణయిస్తున్నారని, అయినప్పటికీ తాను వస్తానని తెలియజేసినా వాటిని రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలని అధికారులను కోరారు. 


Updated Date - 2021-10-30T04:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising