ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివారు కాలనీల్లో మౌలిక వసతులకు ప్రత్యేక నిధులు

ABN, First Publish Date - 2021-12-01T05:09:41+05:30

పటాన్‌చెరు శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.

పటేల్‌గూడ పంచాయతీ పరిధిలో సీసీరోడ్లకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే గూడెంమహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, నవంబరు 30 : పటాన్‌చెరు శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. పటేల్‌గూడ పంచాయతీ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో సీసీరోడ్లకు మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. వేగంగా హైదరాబాద్‌ నగరం విస్తరిస్తోందన్నారు. పెరుగుతున్న కాలనీలు, జనావాసాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు బీరంగూడ కమాన్‌ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రూ.50 కోట్లతో చేపట్టిన వంద ఫీట్ల రోడ్డు పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈర్ల దేవానందం, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, నాయకులు జ్ఞానేశ్వర్‌, శ్రీకాంత్‌, సుశీల్‌దాస్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T05:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising