Telangana: హుస్నాబాద్ ఏసీపీ ఇంట్లో చోరీ
ABN, First Publish Date - 2021-10-05T16:39:13+05:30
జిల్లాలోని హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు.
సిద్దిపేట: జిల్లాలోని హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. ఇటీవలే హుస్నాబాద్ ఏసీపీగా సతీష్ బాధ్యతలు చేపట్టారు. ఇంకా పూర్తిగా వస్తువులు హుస్నాబాద్ కిరాయి ఇంట్లోకి షిఫ్ట్ చేయకపోవడంతో ఎలాంటి విలువైన వస్తువులు చోరీ కాలేదని సమాచారం. ప్రస్తుతం ఏసీపీ సతీష్ లీవ్లో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Updated Date - 2021-10-05T16:39:13+05:30 IST