Telangana: కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2021-09-01T19:10:12+05:30
జిల్లాలోని కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సిద్దిపేట: జిల్లాలోని కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దమ్మకపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మీ, యాదయ్య అనే ఇద్దరు రైతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిరసనకు దిగారు. తమకు ఉన్న 22 గుంటల భూమి వేరే వారి పేరు మీదకు ఎక్కించారని గత కొద్దిరోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-09-01T19:10:12+05:30 IST