సిద్దిపేటలో బెస్త కులస్తుల రాస్తారోకో
ABN, First Publish Date - 2021-01-15T15:47:22+05:30
జిల్లాలోని ముదిరాజులకు చెరువులపై ప్రభుత్వం హక్కు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బెస్త కులస్తులు ఆందోళనకు దిగారు.
సిద్దిపేట: జిల్లాలోని ముదిరాజులకు చెరువులపై ప్రభుత్వం హక్కు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బెస్త కులస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట రూరల్ మండలం రాఘవ పూర్ గ్రామ రహదారిపై నారాయణ రావు పేట, రాఘవ పూర్ గ్రామ బెస్త కులస్తుల రాస్తారోకో నిర్వహించారు. ఇందుల భాగంగా మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Updated Date - 2021-01-15T15:47:22+05:30 IST