ముత్తంగి టోల్ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు
ABN, First Publish Date - 2021-09-08T17:29:47+05:30
జిల్లాలోని పఠాన్చెరు మండలం ముత్తంగి టోల్ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
సంగారెడ్డి: జిల్లాలోని పఠాన్చెరు మండలం ముత్తంగి టోల్ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి విక్రయిస్తున్న పలువురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఏడు చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్న లిక్విడ్ గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోరబండకు చెందిన రాదండి మల్లికార్జున్(20), షేక్ శంషాద్దీన్(21), గోరేకర్ శ్రీకాంత్ (19) ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన అధికారులు వారి వద్ద నుంచి ఒక ద్విచక్రవాహనం, రూ.1700 నగదు, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2021-09-08T17:29:47+05:30 IST